తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలని సూచించారు.
డీలిమిటేషన్కు జనాభా ఒక్కటే ప్రామాణికం కాదని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు నష్టం?
1971 తర్వాత జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా అమలు చేశాయి. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం ప్రభావితం కాలేదు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే అవకాశముందని సీఎం రేవంత్ హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంపు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచి, తెలంగాణకు ఎక్కువ సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
ప్రస్తుత లోక్సభ స్థానాలు యథాతథం – అసెంబ్లీ సీట్లు పెంపు
ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను యథాతథంగా కొనసాగించి, అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని సీఎం రేవంత్ సూచించారు.
https://youtu.be/mSiPfLPS5G4?si=1v_rtANFTGATe58C
2026 జనాభా లెక్కలతో డీలిమిటేషన్
2026లో జనాభా లెక్కలు నిర్వహించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.
డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు నష్టంగా మారకూడదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
