
జమ్మికుంట, మే 21 (zindagi9news ) : జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి భవన్లో బుధవారం సబ్ ఇన్స్పెక్టర్ కె. శేఖర్ ఆధ్వర్యంలో యాంటీ-నార్కోటిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమాజంపై అవి చూపే ప్రభావం గురించి ఆయన విపులంగా వివరించారు. పిల్లలపై తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు, మాదక ద్రవ్యాలపై అవగాహన ఎలా కల్పించాలి అన్న అంశాలపై సూచనలు ఇచ్చారు. యువత భవిష్యత్ను రక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
