
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై శాసనసభలో చర్చించి నిర్ణయం: సీఎం
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణపై శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రశాంతమైన వాతావరణంలో జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ విధానాలపై సభలో చర్చించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఎం చెప్పారు.
