ఇగ్నో-2025 అడ్మిషన్ల గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ:ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల గడువును పొడిగించింది. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కోసం చివరి తేదీని ఆగస్టు 31, 2025 వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు.
ఇగ్నోలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ 👉 ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.
