
ధరావత్ అనిల్కు బీఆర్ఎస్ నాయకుల నివాళి
ఏన్కూర్, నవంబర్ 01 (వైరా నియోజకవర్గ జిందగీ 9న్యూస్ రిపోర్టర్: రాము):
గార్ల ఒడ్డు గ్రామానికి చెందిన యువకుడు ధరావత్ అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో, ఆయన దశదినకర్మ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ దిశా కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ, మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, సీటి కోటేశ్వరరావు, పూర్ణగంటి నాగరాజు, అజ్మీరా రైలు, ఎస్కే కాసిం, డాన్ శీను, బుల్లయ్య, దుగ్గిరాల రమేష్, సాయి, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
