జమ్మికుంట మండల వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) లో గురువారం రోజున జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సదస్సుకు హుజురాబాద్ డిప్యూటీ DMHO డాక్టర్ చందు, మండల విద్యా అధికారి (MEO) హేమలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నులిపురుగుల ప్రభావం – డాక్టర్ చందు వివరణ
ఈ సందర్భంగా డిప్యూటీ DMHO డాక్టర్ చందు మాట్లాడుతూ:
✔ నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, తరచూ కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
✔ శుభ్రమైన ఆహారం తీసుకోవడం, హ్యాండ్ వాష్ టెక్నిక్ పాటించడం అవసరం.
✔ బయట తినే కలుషిత ఆహారం నివారించాలి.
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
ఫిబ్రవరి 10, సోమవారం రోజున 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు.
1-2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర
3-19 ఏళ్ల పిల్లలకు 400 mg పూర్తి మాత్ర
తప్పిపోయిన పిల్లలకు ఫిబ్రవరి 17న తిరిగి ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్స్ రాజేష్, చందన, హెల్త్ ఎడ్యుకేటర్స్ ప్రతాప్, మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్స్ అరుణ, రత్నకుమారి, కుసుమకుమారి సహా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
