
పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వివాహిత మృతి
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో కట్న వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి తాండ్ర స్వామి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గ్రామానికి చెందిన కన్నూరి కళ్యాణి (30) ఆమె భర్త కన్నూరి కిషన్, మామ మల్లయ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అదనంగా రూ.2,00,000/- కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు.ఈ వేధింపులు తట్టుకోలేక కళ్యాణి ఫిబ్రవరి 5న పురుగుల మందు తాగగా, జమ్మికుంటలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట ఎస్ఐ ఎం. క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
