హుజురాబాద్, మార్చి 10: మహిళల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని హుజురాబాద్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకినపల్లి శిరీష పాల్గొని, సావిత్రిబాయి విస్మరణీయ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ విద్యా రంగంలో పురోగమించాలి” అని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి ఉత్సవాల ఇన్చార్జ్ ఉప శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బహుజన ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
