జోగుళాంబ గద్వాలకు చెందిన తేజేశ్వర్ను (32) భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్గా పని చేస్తున్నాడు. ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న తేజేశ్వర్కు వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. ఆమెకు ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని అనుమానాలు వ్యాప్తిచేసాయి. అయితే ఫిబ్రవరి 16న తిరిగి వచ్చి తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడి, తాను ప్రేమలో లేనని, కట్నం ఇబ్బంది కారణంగా స్నేహితురాలి ఇంటికెళ్లానని చెప్పింది.
తేజేశ్వర్ను నమ్మించి, తల్లిదండ్రుల అభ్యంతరాల నడుమ మే 18న ఐశ్వర్య అతడిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన రెండో రోజు నుంచే ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతూ భర్తను పట్టించుకోకపోవడంతో మనస్పర్థలు మొదలయ్యాయి.
జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా, అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు కార్యక్రమంలో ఏపీలోని పాణ్యం ప్రాంతంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఐశ్వర్యను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పని చేస్తోంది. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండగా, అదే వ్యక్తి ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లయిన తరువాత ఐశ్వర్య అతడితో 2,000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు.
తేజేశ్వర్ వల్ల తమ సంబంధానికి అడ్డుగా మారుతాడని భావించి, అతడి ఆస్తి తమకే వస్తుందన్న ఆశతో హత్యకు పథకం రచించారు. బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి, తన డ్రైవర్ను వారితో పంపాడు. జూన్ 17న తేజేశ్వర్ను కలిసి, 10 ఎకరాల భూమి సర్వే చేయాలని చెప్పి కారులో తీసుకెళ్లి, కత్తులతో గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పారవేశారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
