జమ్మికుంట, ఏప్రిల్ 30 (zindagi9news): తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో కాకతీయ విద్యాసంస్థలు అపూర్వ విజయాన్ని సాధించాయి. ఈ విద్యాసంస్థకు చెందిన విద్యార్థినీ మారబోయిన అద్వితా శ్రీ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అద్వితాతోపాటు పలువురు విద్యార్థులు 589, 587, 586, 584, 583, 582 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
కాకతీయ స్కూల్ స్థాపననాటి నుండి రాష్ట్ర స్థాయిలోనే కాక జిల్లాస్థాయిలో కూడా పలు ర్యాంకులను సొంతం చేసుకుంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు చేరే మార్గాన్ని చూపిస్తున్నది. ఈ సార్వత్రిక విజయంలో భాగస్వాములైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి విద్యాసంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెర్మన్ అవిర్నేని సుధాకర్ రావు తెలిపారు.
“భవిష్యత్తులో ఇదే స్పూర్తితో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు శ్రమిస్తాం,” అని ఆయన పేర్కొన్నారు.

