రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజా పరిషత్ (M.P.P) కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ లిస్టును అధికారికంగా ప్రచురించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జిల్లా ఎలక్షన్ అథారిటీ & మండల అభివృద్ధి అధికారి (MPDO) బీమా జయశీల పాల్గొని ఓటర్ లిస్టును డిస్ప్లే చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, “ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా పరిశీలన అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఓటర్లు దీనిపై అవగాహన పెంచుకోవాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ. శ్రీధర్ (M.P.O.), జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, మండల సిబ్బంది పాల్గొన్నారు.
