మార్చి 04,హనుమకొండ,( జిందగీ9 న్యూస్ ప్రతినిధి )
పథకాల అమలులో లీడర్ అయినా క్యాడర్ అయినా పైసలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు.మంగళవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పచ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఎన్నికల నియమావళి ముగుస్తున్న క్రమంలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరు జరిగాయాని, మంజూరు కొరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తెలిపారు.ప్రతి డివిజన్ పరిధిలో ఉన్న నిజమైన అర్హులను ఎంపిక చేసి,ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి నాయకులు వార్డులలో ప్రతిరోజూ పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు.ప్రజలకు,నాకు నాయకులు వారధిగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేసిన,పైసలు వాసులు చేసిన సహించేది లేదు అని అన్నారు.ప్రజలు ఖచ్చితమైన నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత మనపై ఉందని వెల్లడించారు.న్యాయ బద్దంగా అభివృద్ధి, సంక్షేమం కోసమే పని చేయాలని మనం చేసే మంచిపైన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఇప్పటి వరకు ప్రభుత్వ సహకారం,
నాయకులు సమన్వయం,
ప్రజల ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అన్ని సర్వేలలో మంచి ఫలితాలను రాబట్టిందని అన్నారు.
భవిష్యత్ లో కూడా ఇలానే ఉండాలని నాయకులకు,
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పేర్కొన్నారు.
గడిచిన 14 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి,
రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.సమస్యాత్మక గొడవలు,భూ పంచాయతీ సమస్యలపై నాయకులు ఆసక్తి చూపుతున్నారని మండిపడ్డారు.గత పాలకుల పోకడల్ని చూసి ప్రజలు విసిగిపోయారని అన్నారు.నా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్,మామిండ్ల రాజు,సయ్యద్ విజయ శ్రీ రాజాలి,మానస,రాంప్రసాద్, నెక్కొండ కవిత కిషన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి,అంబేద్కర్ రాజు,జిల్లా ఓ బి సి ఉపాధ్యక్షుడు జనార్దన్,జిల్లా ఆర్ టి ఎ సభ్యులు పల్లకొండ సతీష్ మరియు మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,మహిళా నేతలు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
