హనుమకొండలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హనుమకొండ, ఆగస్టు 3 (zindagi9news – రవీందర్ ) నయీమ్నగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శివాని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. వసతిగృహంలోని గదిలో శనివారం రాత్రి ఆమె ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. చదువులో రాణించలేక ఒత్తిడితో చేసినట్టు తోటి విద్యార్థులు చెప్పారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
