హైదరాబాద్లో జయలలిత నివాసం సీజ్.. రూ.83 లక్షల పన్ను బకాయిలు
హైదరాబాద్, మార్చి 31:
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.
2017 నుంచి సుమారు రూ.83 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జీ+4 భవనాన్ని సోమవారం సీజ్ చేశారు.
ఈ భవనాన్ని నివాసంగా మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గతంలో అధికారులను కోరినట్లు సమాచారం.
