బీజేపీ, ఈటల రాజేందర్పై అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేసిన ఆరుగురు నిందితులు పట్టివేత

హైదరాబాద్లోని కేపీహెచ్బీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎంపీ ఈటల రాజేందర్ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో అభ్యంతరకర, అసత్య, పరువు నష్టం కలిగించే సందేశాలతో అనధికారిక బ్యానర్లు ఏర్పాటు చేసిన కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 714/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 352, 353(2) ప్రకారం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు జాన్యవుల రామకృష్ణ (51), గజుల రాకేష్ (34), సయ్యద్ ఖుద్రత్ అహ్మద్ (50), సయ్యద్ మెహరాజ్ (35), షేక్ కలీమ్ (31), నసీర్ ఉద్దీన్ అలియాస్ అఫ్రోజ్ (32)లను అదుపులోకి తీసుకుని, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేశారు.
కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ ఐపీఎస్, కేపీహెచ్బీ డివిజన్ ఏసీపీ ఈ. రవికిరణ్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేపీహెచ్బీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
