రూ. 15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ

రాజన్న సిరిసిల్ల జిల్లా : అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఇసుక లారీని విడిపించేందుకు లంచం డిమాండ్ చేసిన సబ్-ఇన్స్పెక్టర్ ఇప్పుడు కటకటాలపాలయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మాజీ ఎస్.హెచ్.ఓ, ప్రస్తుతం సబ్-ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెర్లగొండ వెంకటేశ్వర్లు మార్చి 23న ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫిర్యాదుదారునికి చెందిన ఇసుక లారీని వదిలిపెట్టడానికి వెంకటేశ్వర్లు రూ. 15,000 లంచం డిమాండ్ చేశారు.
విశేషమేమిటంటే, ఈ లంచం మొత్తాన్ని నేరుగా కాకుండా పి.సి 2963 సత్యనారాయణ ద్వారా యూపీఐ (UPI) పేమెంట్ రూపంలో స్వీకరించారు. దీనిపై ఫిబ్రవరి 28న నమోదైన కేసు ఆధారంగా లోతైన విచారణ జరిపిన ఏసీబీ అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
