
జమ్మికుంట మున్సిపాలిటీ 17వ వార్డు (SC–జనరల్)లో ఏడుగురు అభ్యర్థులు బరిలో
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు (SC–జనరల్)లో మున్సిపల్ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. ఈ వార్డులో మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున కనుమల్ల గణపతి పోటీ చేయగా, జనసేన పార్టీ (JSP) నుంచి దుబాసి ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా పొడేటి రామస్వామి బరిలో నిలిచారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) నుంచి బాతుల లక్ష్మయ్య పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ (INC) తరఫున సుంకరి రమేష్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా కల్లెపల్లి వినోద్, శనిగరపు రాజమౌళి ఎన్నికల బరిలో నిలిచారు.
SC–జనరల్ రిజర్వేషన్ కలిగిన ఈ వార్డులో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయడంతో ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది. అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలే ప్రధాన అజెండాగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 17వ వార్డులో ప్రజల తీర్పు ఎవరి వైపు మొగ్గుతుందో చూడాలి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
