
కరీంనగర్ : మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం (POSH Act) పై WD&CW ఆధ్వర్యంలో సోమవారం వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) ఏర్పాటు తప్పనిసరి అని స్పష్టం చేశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఈ కమిటీలకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
