
హైదరాబాద్: సినీ నటుడు రాంచరణ్ భార్య, అపోలో గ్రూప్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం, ఆమెను తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి ఈ నియామకం తోడ్పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాసన ఇప్పటికే ఆరోగ్య, సామాజిక రంగాల్లో సేవలందిస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
ఈ పదవితో ఆమె యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నారు.
