ఏన్కూరు మండల పిహెచ్సి అధికారులు మౌనం వీడాలి!
జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా?
ఖమ్మం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలి!
గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “పల్లె దవఖానాలు” ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను కేటాయించింది. అయితే, సంబంధిత అధికారులు ఈ నిధులను గోల్మాల్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం & అవకతవకలు
పల్లె దవఖానాల నిధుల ఖర్చుపై ఏ సమాచారం లేనట్లు గోప్యత పాటిస్తున్నారు.
ఎఎన్ఎం, ఎంఎల్హెచ్పి, హెల్త్ అసిస్టెంట్లు విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ, సంబంధిత మెడికల్ ఆఫీసర్ వారిని రక్షిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది పూర్తిగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపాన్ని బట్టబయలు చేస్తోంది.
ప్రజల డిమాండ్ – తక్షణ విచారణ అవసరం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ అవకతవకలపై విచారణ చేపట్టి, గ్రామాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
