హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.62,55,000 విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 219 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందింది. వీణవంకకు 53 మంది, హుజురాబాద్ టౌన్కు 35 మంది, రూరల్కు 38 మంది, జమ్మికుంట రూరల్కు 26 మంది, టౌన్కు 20 మంది, కమలాపూర్కు 47 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
