కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు. పందళం రాజ కుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ సీజన్లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
