విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి – ప్రధానోపాధ్యాయులు ప్రసాద్

టేకుమట్ల, ఆగస్టు 14 (జిందగీ నైన్ న్యూస్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామంలోని బోయినిపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థి–ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పిహెచ్ఎస్ వెలిశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఆటపాటలతో పాటు కష్టపడి చదవాలని, అలా చేస్తేనే ఉన్నత స్థాయికి ఎదగగలరని సూచించారు.
తదనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగి ప్రవీణ్, జెండావందనం కానుకగా విద్యార్థులందరికీ షూస్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి. రాజు, అంగన్వాడీ టీచర్ పోషిని లావణ్య, ఆయా సరిత తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
