ఫోన్పే ద్వారా రూ.10,000 లంచం – పెద్దపల్లి మండల సర్వేయర్పై కేసు

పెద్దపల్లి జిల్లా: ఫిర్యాదుదారునికి చెందిన భూమి సర్వే పంచనామా ప్రతిని అందించడానికి రూ.10,000 లు లంచం తీసుకున్న ఘటన బయటపడింది. పెద్దపల్లి మండల సర్వేయర్ పైండ్ల సునీల్, ప్రైవేట్ వ్యక్తి కటుకూరి రాజేందర్ రెడ్డి ల నుంచి ఫోన్పే ద్వారా లంచం స్వీకరించినట్లు ఆరోపణలపై ఏసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
