
పెబ్బేరు, జూన్ 21 (జిందగీ9న్యూస్): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెబ్బేరు పట్టణంలోని ప్రాథమిక పాఠశాల – చెంచువాడ లో యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చిన్న రాములు, ఉపాధ్యాయురాలు మాధురి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. యోగతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
