
ఏకేసి కాలనీలో విద్యుత్ సమస్య పరిష్కారం
విశాఖపట్నం: ఏకేసి కాలనీలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల ఆవేదనను బీజేపీ నాయకులు వెంటనే పరిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, దాడి రమేష్ ఆదేశాల మేరకు 40వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు మేఘన దుర్గ సమస్యపై స్పందించారు. వెంటనే జీవీఎంసీ ఎలక్ట్రికల్ సిబ్బంది సూపర్వైజర్ శ్రీనును సంప్రదించగా, వారు తక్షణమే చేరుకుని లోపాలను సరిదిద్దారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మేఘన దుర్గతో పాటు బీజేపీ కార్యకర్త గౌతమ్, ప్రాంత యువకులు పాల్గొన్నారు.
