ఇల్లందకుంట MRO కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులు – కేసు నమోదు

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల MRO కార్యాలయంలో 3 మే 2025న సీనియర్ అసిస్టెంట్ వేముగంటి అనిల్ కుమార్, అటెండర్ గోస్కుల రాకేష్ విధులు నిర్వహిస్తుండగా, గట్టు సాయిరాం, పసునూతి శివ వారు వచ్చి బెదిరింపులు, దూషణలు చేసి పనికి ఆటంకం కలిగించారు. 5 ఆగస్టు 2025న మళ్లీ వచ్చి దుర్భాషలాడినట్టు బాధితులు ఫిర్యాదు చేయగా, 11 ఆగస్టు 2025న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఇల్లందకుంట ఎస్సై ఎం. క్రాంతికుమార్ తెలిపారు.
