
సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా – జూన్ 28, (zindag9news): ఇంటికి అధికారికంగా నంబర్ కేటాయించడంలో సహాయం చేస్తామని చెప్పి ఓ ఫిర్యాదుదారుడి నుండి రూ.5,000 లంచం తీసుకుంటూ ఇద్దరు పురపాలక అధికారులు ఏ సి బి అధికారులకు పట్టుబడ్డారు.
ఈ ఘటన సుల్తానాబాద్ పురపాలక కమిషనర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనపర్తి వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్ కుమార్ లు కలసి బాధితుడిని వేధింపులకు గురిచేసి డబ్బు తీసుకున్నట్టు అధికారిక సమాచారం.
ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు కార్యాలయంలో డబ్బు లావాదేవీ జరుగుతుండగా ACB అధికారులు దాడి నిర్వహించి ముట్టడించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
