పాల బాకీ గొడవ… తల్వార్తో దాడి
మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన చౌరస్తాలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాల బాకీ విషయంలో జరిగిన గొడవలో దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్పై పాల వ్యాపారి కిరణ్ తల్వార్తో దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాత బాకీల వసూళ్ల విషయంలో కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం.
ఘటన అనంతరం పరారైన నిందితుడు కిరణ్ కోసం కీసర పోలీసులు గాలిస్తున్నారు.
