పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి జిల్లా సత్తెనపల్లి లోని పార్క్ ఏరియా 13వ వార్డులో పట్టభద్రుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సతైనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మండలపాటి అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
