కామారెడ్డి జిల్లా | Zindagi9News ప్రతినిధి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో (కొత్త ప్లాట్లు) సీసీ రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ నేతృత్వంలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఈ పనులు చేపట్టారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సహకారంతో జరుగుతున్న ఈ రోడ్డు అభివృద్ధి పనులకు గ్రామస్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై మద్దతు తెలిపారు.
