నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి రంగాపురం లో డోన్ ప్రోహిబిషన్ ,ఎక్సైజ్ ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించగా రెండు కేసులను నమోదు చేయగా, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కర్ణాటక రాష్ట్రం కు చెందిన 192 మద్యం టెట్రా ప్యాకెట్స్ లను, 15 లీటర్ల నాటు సారాయిను సీజ్ చేసి, మరియు ఒక ద్విచక్ర వాహనంను సీజ్ చేసి 1800లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడిలలో వెంకటాపురం కి చెందిన బోయ సురేష్,
డి రంగాపురం కి చెందిన మద్దసరి శివశంకర్ పై కేసు నమోదు చేశారు.ఈ దాడులలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సి ఐ బి .వరలక్ష్మి వారి సిబ్బంది మరియు సోమశేఖర్ రావు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ సుధాకర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
