బోర్ వాటర్తోనే బస్టాండ్లో తాగునీటి సరఫరా

జమ్మికుంట బస్టాండ్లో తాగునీటి విషయంలో నిర్లక్ష్యం
జమ్మికుంట: పట్టణంలోని బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటి విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడింది. బస్టాండ్లో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ను శుద్ధి చేసిన నీటితో కాకుండా నేరుగా బోర్ వాటర్తో నింపుతున్నట్లు గుర్తించారు.
ప్రాంగణంలో ఉన్న వాటర్ కూలర్కు బోర్ పైప్ ద్వారా నీటిని సరఫరా చేస్తుండటం, అదే నీటిని ఎటువంటి శుద్ధి లేకుండా ప్రయాణికులు తాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు ఉపయోగించే ఈ నీటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేసవి కాలంలో శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కలుషిత నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి, బస్టాండ్లో శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
