
భారత్కు “ఏఐ కౌన్సిల్” అవసరం
ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు వేగంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో జాతీయ స్థాయిలో ప్రత్యేక “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిను కోరారు. అలాగే జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు చట్టపరమైన చర్యలతో ప్రత్యేక “ఏఐ మంత్రిత్వ శాఖ”ను ఏర్పాటు చేయాలని సూచించారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో దేశానికి ఒక “ఏఐ స్టార్టప్ విలేజ్”ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
జాతీయ ఏఐ వార్రూమ్ ప్రతిపాదన
ఏఐలో వేగంగా జరుగుతున్న మార్పులను కేంద్రం-రాష్ట్రాలు కలిసి పర్యవేక్షించే “జాతీయ ఏఐ వార్రూమ్” అవసరమని పేర్కొన్నారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్ కేంద్రంగా ఈ వార్రూమ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సంవత్సరానికి రెండు సార్లు ఏఐ సమ్మిట్లు
ప్రతి ఏటా ఒక్కసారి చర్చలు సరిపోవని, దేశంలోని వివిధ నగరాల్లో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ సమ్మిట్లు నిర్వహించాలని ప్రతిపాదించారు.
పూర్తి ఏఐ చైన్పై భారత్ నాయకత్వం
GPU చిప్ తయారీ నుంచి గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజీ, కోర్ ల్యాంగ్వేజెస్ సేవల వరకు మొత్తం ఏఐ చైన్పై భారత్ స్పష్టమైన రోడ్మ్యాప్తో ముందుకు రావాలని సూచించారు. స్టార్టప్లకు మద్దతుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని చెప్పారు.
ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోకుండా రీ-స్కిల్లింగ్ వ్యూహాలు అమలు చేయాలని, యువతను యూనికార్న్ స్థాయి సంస్థలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.
ప్లాట్ఫార్మ్ సృష్టికర్తగా భారత్
ప్రపంచ స్థాయి ప్లాట్ఫార్మ్ల సృష్టికర్తగా భారత్ నిలవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ, Google, Meta వంటి గ్లోబల్ కంపెనీల సేవలు భారత్లో సృష్టించబడలేదని అన్నారు.
భారత్ ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకుని, బలమైన విధానాలు, వ్యూహాత్మక పెట్టుబడులతో ప్రపంచ నాయకుడిగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
