
అమరచింత:తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా సేవలందించిన సాయి చంద్ 2వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి అంకితంగా అమరచింత గ్రామంలో విగ్రహావిష్కరణ జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ కోసం జీవితం అర్పించిన సాయిచంద్ సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సాయిచంద్ సతీమణి రజిని సాయిచంద్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 29న అమరచింత గ్రామంలో సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
