ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పాలకవర్గ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించి మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పాలకవర్గ కమిటీ ఏర్పాటు అయింది. ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రామాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం “అపర భద్రాద్రి”గా ఖ్యాతి పొందింది. బ్రహ్మోత్సవాలను మునుపే కమిటీ ఏర్పాటు జరగడం ద్వారా భక్తుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పందిస్తూ, దేవస్థానం అభివృద్ధికి ఇది ఒక మైలురాయి అని తెలిపారు.
కమిటీలో ఇంగిలి రామారావును ఆలయ చైర్మన్గా నియమించగా, మొత్తం 14 మంది డైరక్టర్లు సభ్యులుగా నియమితులయ్యారు.
