సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ కమిటీ దే హవా..
వారికి వారి చుట్టాలకు పథకాలు ఇవ్వడానికైనా కమిటీగా ఎన్నుకున్నది,మాచినేనిపేట తండా గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభను వెంటనే రద్దు చేయాలి అని భారతీయ గోరు బంజారా పోరాట సమితి జులురుపాడు మండల అధ్యక్షులు లాకావత్ గణేష్ నాయక్ అన్నారు. జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండ గ్రామంలో జరిగినటువంటి గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు వారి బంధువులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వలన నిజమైన పేద ప్రజలకు అన్యాయం జరిగి సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి కావున తక్షణమే మాచినేనిపేట గ్రామ పంచాయతీలు జరిగినటువంటి గ్రామసభను రద్దుచేసి రి సర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
