హుజురాబాద్ నియోజకవర్గం బోర్నపల్లి గ్రామం 14 వ వార్డుకు చెందిన సమ్మెట సాయిరాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ,త్వరగా గుండెకి సర్జరీ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడని తెలిసి , చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఆర్ధిక పరిస్థితి బాగాలేదని వెంకట్ అనుచరుడు మేడుదుల అర్జున్ ద్వారా తెలిసిన వెంటనే ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ స్పందించి ప్రభుత్వ దృష్ఠ్టికి తీసుకెళ్లి గంటల వ్యవధిలోనే వైద్యఖర్చుల కోసం కావాల్సిన రూ . 1,25,000 లు ఎల్ ఓ సి మంజూరు చేయించారు. ఎల్ ఓ సి తో పాటు సర్జరీ కి కావాల్సిన రక్తం కూడా ఏర్పాటు చేసారు.
